ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

author img

By

Published : Mar 10, 2023, 12:49 PM IST

gold-rate-today-in-hyderabad-and-vijayawada
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు కొంతమేర పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగి.. రూ.57,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.35 పెరిగి. ప్రస్తుతం రూ.63,471 వద్ద ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​ నగరంలో పది గ్రాముల బంగారం ధర రూ.57,320గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,471 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలోనూ 10 గ్రాముల పసిడి ధర రూ.57,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,471గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.57,320 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,471 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పుత్తడి ధర రూ.57,320 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,471గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1832 డాలర్లు వద్ద ఉంది. ఔన్సు వెండి ధర 20.03 డాలర్లుగా ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​ నగరంలో పెట్రోల్ లీటరు ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీ నగరంలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,34,871 పలుకుతోంది. బైనాన్స్​ కాయిన్​ సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.16,34,871
ఇథీరియంరూ.1,16,184
టెథర్​రూ.82
బైనాన్స్​ కాయిన్​రూ.22,413
యూఎస్​డీ కాయిన్రూ.82

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు కుదేలవుతున్నాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్‌ 713 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 59,082 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఎన్​ఎస్ఈ సూచీ నిఫ్టీ 203 పాయింట్లు నష్టపోయి 17,386 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో స్టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి మారకం విలువ
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం 8 పైసలు తగ్గి విలువ 82.14 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.