ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Mar 9, 2023, 11:25 AM IST

gold rate today in hyderabad and vijayawada
ఏపీ తెలంగాణలో బంగారం, వెండి ధరలు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.170 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.56,830వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.175తగ్గి.. ప్రస్తుతం రూ.63,425 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,830గా ఉంది. కిలో వెండి ధర రూ.63,425 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,830వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,425 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,830గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,425 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,830వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,425 గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.1814.50కు చేరుకుంది. ఔన్సు వెండి ధర 20.05డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రధాన క్రిప్టో కరెన్సీ ధరలు సైతం పతనమయ్యాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,80,333 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.17,80,333
ఇథీరియంరూ.1,25,945
టెథర్​రూ.81.87
బైనాన్స్​ కాయిన్​రూ.23,731
యూఎస్​డీ కాయిన్రూ.81.88

స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 149.95 పాయింట్లు పతనమై 60,198 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ29.75 పాయింట్లు నష్టపోయి 17,724 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోని షేర్లు..
సెన్సెక్స్‌ 30 సూచీలో టైటాన్, విప్రో, మారుతి, సన్​ఫార్మా, రిలయన్స్, టీసిఎస్, ఐటీసీ, టాటా మోటర్స్, కొటాక్ బ్యాంక్, బజాజ్​ ఫైనాన్స్, ఏషియన్ పేంట్స్ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టాటాస్టీల్, ఎన్​టీపీసీ, ఆక్సిక్ బ్యాంక్, ఎయిర్​టెల్, పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
రూపాయి విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ13 పైసలు పెరిగి 82.82 దగ్గర కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.