ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Feb 24, 2023, 11:19 AM IST

Gold Rate Today
Gold Rate Today

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి.. ప్రస్తుతం రూ.57,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.800 తగ్గి.. ప్రస్తుతం రూ.66,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,700గా ఉంది. కిలో వెండి ధర రూ.66,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,700వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,500 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,700గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,700వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,500 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1824.60 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.29 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,77,449 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.19,77,449
ఇథీరియంరూ.1,36,132
టెథర్​రూ.82.75
బైనాన్స్​ కాయిన్​రూ.25,591
యూఎస్​డీ కాయిన్రూ.82.74

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 59,822 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 17,575 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, ఐటీసీ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం విలువ
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి.. రూ. 82.69 దగ్గర కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.