ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

author img

By

Published : Dec 30, 2022, 11:16 AM IST

gold-rate-today-in-hyderabad-and-vijayawada
బంగారం

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.56,460వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.529 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,589 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,460 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,589 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,460 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,589 గా ఉంది.
  • Gold price in Vijayawada: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,460 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,589 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,460 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,589 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1817.60 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.00 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,72,656 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,72,656
ఇథీరియంరూ.98,966
టెథర్​రూ.82.69
బైనాన్స్​ కాయిన్​రూ.20,311
యూఎస్​డీ కాయిన్రూ.82.77

లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్‌ సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకు దోహదం చేస్తున్నాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో 61,291 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 18,238 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, టైటన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ:
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగి ప్రస్తుతం 82.72 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.