పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా.. ఆగని రూపాయి పతనం

author img

By

Published : Sep 28, 2022, 11:23 AM IST

Gold Rate Today In Hyderabad

Gold Rate Today : దేశంలో బంగారం ధర పెరిగింది. రూపాయి విలువ మరోసారి పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.100 అధికమై.. ప్రస్తుతం రూ.50,960 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.700 తగ్గి.. రూ.55,800 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,960గా ఉంది. కిలో వెండి ధర రూ.55,800 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,960 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,800గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,960గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,800వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,960వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.55,800 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1625 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.17 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ ధర రూ.92,360 పతనమైంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,32,853 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,32,853
ఇథీరియంరూ.1,05,032
టెథర్​రూ.81.84
బినాన్స్​ కాయిన్​రూ.22,069
రిపుల్రూ.34.78

Stock Market Updates:
స్టాక్ మార్కెట్లు బుధవారం సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి.. 57 వేల మార్క్​ను కోల్పోయింది. ప్రస్తుతం 56,886 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం నష్టాల్లోనే ఉంది. 17 వేల మార్క్ కోల్పోయిన నిఫ్టీ.. 60 పాయింట్లు పతనమై.. ప్రస్తుతం 16,941 వద్ద కదలాడుతోంది.

లాభనష్టాల్లోనివి:
సెన్సెక్స్ 30 షేర్లలో సన్​ఫార్మా అత్యధికంగా 2శాతం లాభపడింది. డాక్టర్ రెడ్డీస్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఏషియన్ పేంట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ షేర్లు డీలా పడ్డాయి.

రూపాయి విలువ:
రూపాయి పతనానికి అడ్డుకట్ట పడటం లేదు. బుధవారం ట్రేడింగ్​లో 40 పైసలు పడిపోయిన రూపాయి.. మరో జీవితకాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం 81.93 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.