ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేటి లెక్కలు ఇలా

author img

By

Published : Mar 25, 2023, 12:26 PM IST

today gold silver rates in telugu states
today gold silver rates in telugu states

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.260 పెరిగి.. ప్రస్తుతం రూ.61,370గా ఉంది. కిలో వెండి ధర రూ.330 తగ్గి.. ప్రస్తుతం రూ.72,130 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,370వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.72,130 రూపాయలుగా ఉంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,370గా ఉంది. కిలో వెండి ధర రూ.72,130 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,370 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.72,130గా ఉంది.

Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,370గా ఉంది. కేజీ వెండి ధర రూ.72,130 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,977.70 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.25డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,65,939 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.22,65,939
ఇథీరియంరూ.1,44,319
టెథర్​రూ.82.45
బైనాన్స్​ కాయిన్​రూ.26,681
యూఎస్​డీ కాయిన్రూ.82.34

అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ప్రపంచ స్టాక్​ మార్కెట్లు..
శనివారం భారతీయ స్టాక్​ మార్కెట్లకు సెలవు. మరోవైపు.. శుక్రవారం అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులకు గురయ్యాయి. ఈ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు సెన్సెక్స్ సూచీ ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. స్టాక్స్ మార్కెట్లు ముగిసేసరికి 398 పాయింట్ల నష్టంతో 57,422 వద్ద ముగిసింది. నిఫ్టీ 131 పాయింట్లు నష్టంతో 16,945 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే అమెరికా మార్కెట్లలో డోజోన్స్​ 73 పాయింట్లు పెరిగి 32,179 వద్ద స్థిరపడింది. ఇక, నాస్​డాక్​ 0.1 శాతం నష్టాన్ని చవిచూసింది. అధిక వడ్డీ రేట్లతో బ్యాంకుల బలహీన పడుతున్నాయన్న భయాలతో.. మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.