ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..

author img

By

Published : May 31, 2023, 5:11 PM IST

Gold And Stocks
స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు ఏపీ తెలంగాణలో ఎంతంటే

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.455 పెరిగి.. రూ.60,400కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర రూ.500 పెరిగి.. రూ. 72,750 వద్ద నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,960 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,030గా ఉంది.
  • Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,960 గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam : వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,960 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.73,030గా ఉంది.
  • Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,960గా ఉంది. కేజీ వెండి ధర రూ.73,030 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,958 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.27 డాలర్ల వద్ద ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,35,494 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.22,35,494
ఇథీరియంరూ.1,54,227
టెథర్​రూ.82.69
బైనాన్స్​ కాయిన్​రూ.25,384
యూఎస్​డీ కాయిన్రూ.82.74

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజ్‌​ (బీఎస్​ఈ) సెన్సెక్స్​ 347 పాయింట్లు క్షీణించి 62,622 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ.. 99 పాయింట్లు నష్టపోయి 18,534 పాయింట్ల దగ్గర స్థిరపడింది.

సెన్సెక్స్​ 30 సూచీలో యాక్సిస్​ బ్యాంక్​, ఎస్​బీఐ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్టీపీసీ, టాటా స్టీల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​ షేర్లు నష్టపోగా.. భారతీ ఎయిర్​టెల్​, టెక్ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్​, సన్​ ఫార్మా, టాటా మోటార్స్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ కంపెనీలు లాభాల బాటలో ఉన్నాయి.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.