ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..

author img

By

Published : Dec 5, 2022, 1:56 PM IST

gold price today
gold price today

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.850 పెరిగి రూ.68,300 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.55,600గా ఉంది. కిలో వెండి ధర రూ.68,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,300 గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,300 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,800.25 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.17 డాలర్ల వద్ద ఉంది.

ఇంధన ధరలు ఇలా..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.14,11,813 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.14,11,813
ఇథీరియంరూ.1,05,670
టెథర్​రూ.81.56
బైనాన్స్​ కాయిన్​రూ.24,108
యూఎస్​డీ కాయిన్రూ.81.66

ఆర్​బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం
రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం సోమవారం దిల్లీలో ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం​ 6శాతం కంటే ఎక్కువగా ఉన్నందున మళ్లీ వడ్డీరేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కమిటీ నిర్ణయం కోసం.. దేశీయ మార్కెట్​లు ఎదురుచూస్తున్నాయి.
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్​బీఐ ఇప్పటికే మే నుంచి కీలకమైన పాలసీ రేటును 190 బేసిస్ పాయింట్ల మేర.. 5.9 శాతానికి పెంచింది. అక్టోబర్​లో ద్రవ్యోల్బణం 6.77శాతంగా ఉంది.

ష్టాక్​ మార్కెట్​లు..
సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 103 పాయింట్లు తగ్గి 62,765 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు తగ్గి 18,672 వద్ద కొనసాగుతోంది.
హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే, పవర్‌ గ్రిడ్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ షేర్​లు లాభాలను నమోదు చేశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.