ETV Bharat / business

రూ.కోటికిపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య డబుల్​​.. దిల్లీ కంటే ఏపీలోనే ఎక్కువ!

author img

By

Published : Aug 7, 2023, 8:10 PM IST

Individuals reporting annual income of above Rs 1 cr doubles in 2 years
డబుల్​ అయిన ఏడాదికి రూ.కోటికిపైనే సంపాదిస్తున్న వారు.. ఆంధ్రప్రదేశ్​ ఏ స్థానంలో ఉందంటే..

1 Crore Plus Per Year Earnings Individuals Doubled : దేశంలో ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదించేవారి వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2022-23 అసెస్​మెంట్​ ఇయర్​లో మొత్తం 1,69,890 మంది వ్యక్తులు రూ.కోటికి పైగా వార్షిక ఆదాయాన్ని సంపాదించినట్లుగా వెల్లడించారని తెలిపింది. 2020-21 అసెస్​మెంట్​ ఇయర్​తో పోలిస్తే ఈ సంఖ్య డబుల్​ అయినట్లుగా అధికారులు తెలిపారు.

1 Crore Plus Year Earnings Individuals Doubled : భారత్​లో రూ.కోటికిపైగా వార్షిక ఆదాయం పొందేవారి వ్యక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు ఆదాయ పన్ను శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గత 2022-23 అసెస్​మెంట్​ ఇయర్​లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 1,69,890 మంది రూ.కోటికి పైగా వార్షిక ఆదాయాన్ని సంపాదించినట్లుగా వెల్లడించారని తెలిపింది. కాగా, 2020-21 అసెస్​మెంట్​ ఇయర్​ నుంచి అసెస్​మెంట్​ ఇయర్ 2022-23​కు ఈ సంఖ్య రెట్టింపయినట్లుగా ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు తెలిపారు. మొత్తం 81,653 మంది వ్యక్తులు(ఇండివిజువల్స్​) రూ.కోటికి పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లుగా 2020-21 అసెస్​మెంట్​ ఇయర్​లో ప్రకటించారు. అయితే 2021-22 అసెస్​మెంట్​ ఇయర్​లో రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న వారి సంఖ్య 1,14,446గా ఉంది. మొత్తంగా ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య డబుల్​ కావడానకి రెండేళ్ల సమయం పట్టిందని నివేదిక వివరించింది.

ఏడాదికి రూ.కోటికి పైగా ఆదాయం సంపాదించిన వారి సంఖ్య ఇలా..

అసెస్​మెంట్​ ఇయర్ కోటికి పైగా ఆదాయం సంపాదించిన వ్యక్తులు
2022-231,69,890
2021-221,14,446
2020-2181,653

2022-23 అసెస్​మెంట్​ సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు సహా మొత్తం 2.69 లక్షల మంది రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని చూపించినట్లుగా ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీ రిటర్న్స్​ డేటా ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఐటీఆర్​లు దాఖలు చేసిన వారిలో 66,397 కంపెనీలు, 25,262 సంస్థలు, 3,059 ట్రస్టులతో పాటు 2,068 అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్​ ఉన్నారు. మొత్తంగా గడిచిన గత మూడు అసెస్​మెంట్సంవత్సరాల్లో దాఖలైన ఐటీఆర్​ల సంఖ్య వివరాలిలా ఉన్నాయి.

అసెస్​మెంట్​ సంవత్సరం​ఐటీఆర్​ల సంఖ్య
2022-23 7.78 కోట్లు
2021-22 7.14 కోట్లు
2020-21 7.39 కోట్లు

Andhra Pradesh Place In ITR Filings : 2022-23 అసెస్​మెంట్​ సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ వివరాల ప్రకారం ఐటీఆర్​లు ఫైల్​ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్​ కాస్త మెరుగైన గణాంకాలతో రాజధాని దిల్లీ కంటే ముందు స్థానంలో కొనసాగుతోంది.

రాష్ట్రాలు ఐటీఆర్​లు
మహారాష్ట్ర 1.98 కోట్లు
ఉత్తర్​ప్రదేశ్​ 75.72 లక్షలు
గుజరాత్​ 75.62 లక్షలు
రాజస్థాన్​ 50.88 లక్షలు
బంగాల్​ 47.93 లక్షలు
తమిళనాడు 47.91 లక్షలు
కర్ణాటక 42.82 లక్షలు
ఆంధ్రప్రదేశ్​ 40.09 లక్షలు
దిల్లీ 39.99 లక్షలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.