ETV Bharat / business

మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్​ 580 పాయింట్లు పతనం

author img

By

Published : Jan 27, 2022, 3:45 PM IST

Updated : Jan 27, 2022, 4:09 PM IST

Stock Market
Stock Market

Stock Market: స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 580 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయింది.

Stock Market: స్టాక్​ మార్కెట్లపై బేర్ విరుచుకుపడింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతలతో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 581 పాయింట్లు పతనమై.. 57,276 వద్ద ముగిసింది. మరో సూచి జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి..17,110 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ ఉదయం 57,317 పాయింట్లు వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో మరింత నష్టాల్లో కూరుకుపోయింది. ఒక దశలో 56,439 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల దన్నుతో కోలుకుంది. రోజులో 1,069 పాయింట్లు మధ్య కదలాడిన సూచీ.. మరో దశలో 57,508 వద్ద గరిష్ఠాన్నికి చేరింది.

మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 17,062 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16,866 వద్ద కనిష్ఠాన్ని తాకి.. 17,182 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది.

లాభానష్టాల్లోనివి ఇవే..

  • 30 షేర్ల సూచీలో ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంకు, ఎస్​బీఐఎన్​, మారుతి, కొటక్​బ్యాంకు, ఇండస్​ఇండ్​బ్యాంకు, సన్​ఫార్మా, ఎం అండ్​ ఎం, అల్ట్రాటెక్​సిమెంట్​, ఐటీసీ మాత్రమే లాభాలు గడించాయి.
  • హిచ్​సీఎల్​టెక్​, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్​, టీసీఎస్​, విప్రో, టైటాన్​, ఇన్ఫోసిస్​, నెస్లే, పవర్​గ్రిడ్​, టాటాస్టీల్​, బజాజ్​ ఫిన్​ సెర్వ్​ ప్రధానంగా నష్టపోయాయి.

కారణాలివే..

వడ్డీ రేట్లు పెంచుతామని అమెరికా ఫెడరల్ బ్యాంకు బుధవారం సంకేతాలు ఇవ్వడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఫెడ్ పేర్కొంది. ఇది మదుపర్లు సెంటిమెంట్​ను దెబ్బతీసింది. విదేశీ సంస్థాగత మదుపర్లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడమూ సూచీలు నష్టాలు చవిచూశాయి.

అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా కదిలాయి. ఇతర ఆసియా మార్కెట్లు డీలా పడటం దేశీయ సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుదల కూడా మార్కెట్ల నష్టాలకు కారణమైంది.

ఇదీ చూడండి: టాటా సన్స్ ఛైర్మన్​తో ప్రధాని మోదీ భేటీ

Last Updated :Jan 27, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.