దూసుకెళ్లిన సూచీలు- నిఫ్టీ 241 పాయింట్లు వృద్ధి
Updated on: Mar 14, 2022, 3:44 PM IST

దూసుకెళ్లిన సూచీలు- నిఫ్టీ 241 పాయింట్లు వృద్ధి
Updated on: Mar 14, 2022, 3:44 PM IST
15:43 March 14
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్ను లాభాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 936 పాయింట్లకు పైగా ఎగబాకి 56,486 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ కూడా 241 పాయింట్లు వృద్ధి చెంది 16,871 వద్ద ట్రేడింగ్ ముగించింది.
12:10 March 14
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 520 పాయింట్లు పెరిగి 56,070కి చేరింది. నిఫ్టీ 125 పాయింట్లు వృద్ధి చెంది 16,755కి చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 2శాతానికి పైగా లాభపడ్డాయి. ఐఓసీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ 2శాతానికిపైగా నష్టపోయాయి.
11:10 March 14
స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 423 పాయింట్ల వృద్ధి చెంది 56వేల మార్కుకు దగ్గరగా ఉంది. ప్రస్తుతం 55,973 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 16,727 వద్ద ట్రేడవుతోంది.
09:12 March 14
దూసుకెళ్తున్న సూచీలు.. 56వేల మార్కు ఎగువన సెన్సెక్స్
Stock market news: స్టాక్మార్కెట్లు ఈ వారం తొలిరోజు సెషన్ను లాభాలతో ప్రారంభించాయిం. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సెన్సెక్స్ 215 పాయింట్లు వృద్ధి చెంది 55,766కి చేరింది. నిఫ్టీ 48 పాయింట్లు మెరుగుపడి 16,678 వద్ద ట్రేడవుతోంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టాటా మోటార్స్, ఐఓసీ, హెచ్యూఎల్ షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
