ETV Bharat / business

Stock Market: ఒడుదొడుకులు అధిగమించిన సూచీలు- ఎట్టకేలకు లాభాలు

author img

By

Published : Jan 25, 2022, 9:24 AM IST

Updated : Jan 25, 2022, 3:41 PM IST

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES

15:38 January 25

Stock Market Today: వరుసగా నష్టాలను చవిచూసిన స్టాక్​ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. మంగళవారం ఉదయం కూడా భారీ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల ఫలితాలు, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు బలపడటం మార్కెట్లకు అనుకూలంగా మారింది. దీంతో సెన్సెక్స్ 367 పాయింట్లు మెరుగుపడి 57,858కి చేరింది. నిఫ్టీ 129 పాయింట్లు వృద్ధి చెంది 17,278కి పెరిగింది.

ఇంట్రాడే..

ఉదయం సెషన్​ను 57వేల 536 పాయింట్లతో ప్రారంభించిన సెన్సెక్స్​ కొద్దిసేపటికే 300 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత దాదాపు 1000 పాయింట్ల వరకు కుప్పకూలింది. ఒకానొక దశలో 56వేల400కు పడిపోయింది. ఆ తర్వాత తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని మెల్లగా లాభాల బాట పట్టింది. మొదట 100 పాయింట్లు వృద్ధి చెందింది. అప్పటినుంచి అంతకంతకూ పెరుగుతూ చివరకు 367పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. నిఫ్టీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొని 129 పాయింట్లు వృద్ధి చెందింది.

లాభనష్టాల్లోనివి

అత్యధికంగా యాక్సిస్​ బ్యాంకు షేర్లు 7శాతానికిపైగా లాభపడ్డాయి. మారుతి 6.5శాతం వృద్ధి చెందింది. ఎస్​బీఐఎన్, ఇండస్​ఇండ్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​ గ్రిడ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు లాభాలను ఆర్జించాయి.

హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్​, విప్రో, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

14:46 January 25

మంగళవారం ఓపెనింగ్ సెషన్​లో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్​ మార్కెట్లు ఆ తర్వాత కోలుకుని లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే సెన్సెక్స్​ 270 పాయింట్లు వృద్ధి చెంది 57,762కి పెరిగింది. నిఫ్టీ 91 పాయింట్లు వృద్ధి చెంది 17,240 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

యాక్సిస్​ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐ, యూపీఎల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, విప్రో, టైటాన్​ కంపెనీ, టెక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు డీలాపడ్డాయి.

13:53 January 25

లాభాల బాట..

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఇవాళ కాస్త కోలుకున్నాయి. ఆరంభంలో భారీ నష్టాలకు చెక్​ పెడుతూ.. సూచీలు లాభాల్లోకి వెళ్లాయి.

ప్రస్తుతం సెన్సెక్స్​ 150 పాయింట్లు పెరిగి.. 57 వేల 630 ఎగువన కొనసాగుతోంది.

నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 17 వేల 210 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

అత్యధికంగా యాక్సిస్​ బ్యాంక్ 6 శాతానికిపైగా పెరిగింది., భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐ, యూపీఎల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, విప్రో, టైటాన్​ కంపెనీ, టెక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ డీలాపడ్డాయి.

10:59 January 25

మళ్లీ నష్టాలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు ఇవాళ తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో 1000 పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్​ మళ్లీ కోలుకొని ఓ దశలో 100 పాయింట్లకుపైగా పెరిగింది. అనంతరం మరోసారి నష్టాలబాట పట్టింది.

ప్రస్తుతం సెన్సెక్స్​ 500 పాయింట్లు కోల్పోయి 57 వేల దిగువకు చేరింది.

నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతో 17 వేల 10 వద్ద కొనసాగుతోంది.

09:39 January 25

కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు..

ఆరంభంలో భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు కాస్త కుదుటపడ్డాయి. మొదట 300 పాయింట్లకుపైగా నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్​ కాసేపటికే దాదాపు 1000 పాయింట్ల పతనంతో.. 56 వేల 410 పాయింట్ల కనిష్ఠాన్ని చేరింది. అనంతరం కోలుకున్నాయి.

30 నిమిషాల వ్యవధిలో 1000 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం సూచీలు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

సెన్సెక్స్​ 100 పాయింట్లు పెరిగి.. 57 వేల 590 ఎగువన కొనసాగుతోంది.

నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో .. 17 వేల 190 ఎగువకు చేరింది.

09:12 January 25

Stock Market: తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్​ మార్కెట్లు

దేశయ స్టాక్​ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం సెషన్​లో 1500 పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్​.. ఇవ్వాళ ట్రేడింగ్​ ఆరంభంలోనే కుప్పకూలాయి.

సెన్సెక్స్​ 900 పాయింట్లకుపైగా కోల్పోయి.. 56 వేల 586 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 250 పాయింట్లకుపైగా నష్టంతో 16 వేల 895 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

యాక్సిస్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​, ఓఎన్​జీసీ రాణిస్తున్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, విప్రో, టెక్​ మహీంద్రా, దివీస్​ ల్యాబ్స్​, శ్రీ సిమెంట్స్​ డీలాపడ్డాయి.

Last Updated :Jan 25, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.