ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లపై 'బేర్​' పంజా- 60 వేల దిగువకు సెన్సెక్స్​​

author img

By

Published : Jan 20, 2022, 9:24 AM IST

Updated : Jan 20, 2022, 3:48 PM IST

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES

15:40 January 20

Stock market news: బేర్​ పంజాతో స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ నష్టాలను చవిచూశాయి. మూడు సెషన్లలోనే సెన్సెక్స్​ 2000 పాయింట్లకుపైగా నష్టపోయింది. మదుపర్ల రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైంది. గురువారం సెషన్​లో అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలు, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల సెంటిమెంట్​ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో ఒకానొక దశలో దాదాపు 1000 పాయింట్లు పతనమైన సెన్సెక్స్​ చివర్లో కాస్త కోలుకుంది. 634 పాయింట్లు నష్టపోయి 60వేల దిగువన 59,464 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 17,757కు దిగొచ్చింది.

కారణాలివే...

  • అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ పవనాలు స్టాక్​ మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగే సూచనలు కన్పిస్తుండటం, ఫెడ్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయనే భయాందోళనల నడుమ మదుపర్లకు అమ్మకాలకు మొగ్గు చూపారు.
  • ముడి చుమురు ధరలు ఏడు సంవత్సారాల గరిష్ఠానికి చేరడం కూడా మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ భారత్​లో పెట్రోల్, డీజిల్ స్థిరంగా ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం చమురు ధరలు పెరిగే అవకాశముందనే భయాలు సూచీల పతనానికి మరో కారణం.
  • దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. కేసుల సంఖ్య గురువారం మూడు లక్షలు దాటడం మదుపర్లను ప్రభావితం చేసింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

  • బజాజ్​ ఫిన్​సర్వ్, బజాజ్​ ఆటో, దివిస్ ల్యాబ్స్​, సన్​ ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
  • పవర్ గ్రిడ్ కార్ప్, భారతీ ఎయిర్​టెల్, గ్రాసిమ్, జేఎస్​డ్బ్లూ స్టీల్, బ్రిటానియా షేర్లు లాభాలు గడించాయి.

13:45 January 20

స్టాక్​ మార్కెట్లపై బేర్​ పంజా విసిరింది. సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

ఐటీ, ఫార్మా రంగాల షేర్లు పడిపోతున్నాయి. రియల్టీ, లోహ, విద్యుత్తు రంగం షేర్లలో కాస్త అమ్మకాలు కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 860 పాయింట్ల నష్టంతో.. 59 వేల 230 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో దాదాపు 900 పాయింట్లు పతనమైంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 239 పాయింట్లు కోల్పోయి.. 17 వేల 699 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

పవర్​గ్రిడ్​, కోల్​ ఇండియా, భారతీ ఎయిర్​టెల్​, గ్రేసిమ్​, హీరో మోటోకార్ప్​ లాభాల్లో ఉన్నాయి.

బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ నష్టపోయాయి.

11:17 January 20

బేర్​ పట్టు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

ఐటీ, ఫార్మా రంగాల షేర్లు పడిపోతున్నాయి. రియల్టీ, లోహ, విద్యుత్తు రంగం షేర్లలో కాస్త అమ్మకాలు కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 470 పాయింట్లకుపైగా నష్టంతో.. 59 వేల 620 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 125 పాయింట్లు కోల్పోయి.. 17 వేల 813 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

పవర్​గ్రిడ్​, కోల్​ ఇండియా, గ్రేసిమ్​, హీరో మోటోకార్ప్​ లాభాల్లో ఉన్నాయి.

బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ నష్టపోయాయి.

08:44 January 20

తీవ్ర ఒడుదొడుకుల్లో మార్కెట్లు- 60 వేల దిగువకు సెన్సెక్స్​​

Stock Market Live Updates: అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. ​ఐటీ, చమురు సూచీలు ఆరంభంలోనే కుదేలయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 160 పాయింట్లకుపైగా కోల్పోయి.. 60 వేల దిగువకు చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ 42 పాయింట్ల నష్టంతో 17 వేల 896 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో ఇవే..

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, గ్రేసిమ్​, అల్ట్రాటెక్​ సిమెంట్, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ లాభాల్లో ఉన్నాయి.

ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, ఓఎన్​జీసీ, సిప్లా, ఏషియన్​ పెయింట్స్​ డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: ఐఆర్‌ఈడీఏలోకి రూ.1,500 కోట్ల అదనపు మూలధనం

Market Approval: బహిరంగ​ మార్కెట్​లోకి కొవిషీల్డ్, కొవాగ్జిన్!

Last Updated :Jan 20, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.