ETV Bharat / business

Stock Market live: ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న దేశీయ సూచీలు

author img

By

Published : Jan 18, 2022, 9:25 AM IST

Updated : Jan 18, 2022, 11:51 AM IST

STOCKS LIVE
STOCKS LIVE

11:40 January 18

స్టాక్ మార్కెట్లు నష్టాల మధ్యే ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 61,197 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మారుతీ షేరు రెండున్నర శాతం పడిపోయింది. టెక్ మహీంద్ర, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టైటాన్ షేర్లు రాణిస్తున్నాయి.

నిఫ్టీ 40 పాయింట్ల మేర నష్టపోయింది. ప్రస్తుతం 18,267 వద్ద కొనసాగుతోంది.

09:41 January 18

అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పవనాలతో స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ట్రేడవుతున్నాయి. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్ 73 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 61,237 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

అటు నిఫ్టీ సైతం నష్టాల్లోకి మళ్లింది. 42 పాయింట్లు కోల్పోయి.. 18,265 వద్ద కొనసాగుతోంది.

09:07 January 18

Stock Market live: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 120 ప్లస్

Stock Market live: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 124 పాయింట్ల లాభంతో 61,433 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

31 పాయింట్లు లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ప్రస్తుతం 18,340 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్ 30 షేర్లలో సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్ షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Last Updated :Jan 18, 2022, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.