ETV Bharat / business

ఐటీ, ఆర్థిక షేర్ల జోరు- సెన్సెక్స్ 657 పాయింట్లు ప్లస్

author img

By

Published : Feb 9, 2022, 3:37 PM IST

stock market closing
stock market closing

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 657 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్లు లాభపడ్డాయి.

Stock Market Close: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు జోరు మీదున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 657 పాయింట్లు పెరిగి 58 వేల 466 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్​ దాదాపు 350కుపైగా పాయింట్ల లాభంతో సెషన్​ను ప్రారంభించి.. ఎక్కడా తగ్గలేదు. ఇంట్రాడేలో దాదాపు 700 పాయింట్ల లాభంతో.. 58 వేల 508 వద్ద గరిష్ఠాన్ని తాకింది. సెషన్​ కనిష్ఠం 58,105 పాయింట్లు.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో 17 వేల 464 వద్ద సెషన్​ను ముగించింది.

ఐటీ, ఆర్థిక షేర్లు పుంజుకోవడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. ఆటో, లోహ, ప్రైవేటు బ్యాంకింగ్​ రంగం షేర్లు 1-2 శాతం మేర లాభపడ్డాయి.

పీఎస్​యూ బ్యాంక్​లు, ఆయిల్​ అండ్​ గ్యాస్​ షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి.

లాభనష్టాల్లో ఇవే..

కోల్​ ఇండియా, మారుతీ సుజుకీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఆటో, హిందాల్కో రాణించాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి.

ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, ఐటీసీ, ఐఓసీ, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ డీలాపడ్డాయి.

ఆ కార్ల ఇంజిన్​లో మంటలు.. 4.85లక్షల యూనిట్లు రీకాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.