ETV Bharat / business

వారాంతపు సెషన్​లో నష్టాలు.. సెన్సెక్స్​ 143, నిఫ్టీ 44 డౌన్​

author img

By

Published : Feb 4, 2022, 3:42 PM IST

STOCK MARKET CLOSING,
STOCK MARKET CLOSING,

Stock Market Closing: వారాంతపు సెషన్​లో స్టాక్​ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్​లో సెన్సెక్స్ 143 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయాయి. ​

Stock Market Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వారాంతంలో.. తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 143 పాయింట్లు కోల్పోయి 58 వేల 645 వద్దకు చేరింది.

దాదాపు 150కిపైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్​.. కాసేపటికే నష్టాల బాట పట్టింది. ఇంట్రాడేలో 300పాయింట్లకుపైగా కోల్పోయి.. 58 వేల 447 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 44 పాయింట్ల పతనంతో 17 వేల 516 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్​లో మిశ్రమ పవనాలు.. దేశీయ సూచీలను దెబ్బకొట్టాయి. టీసీఎస్​, విప్రో, ఇన్ఫోసిస్​, ఆర్​ఐఎల్​ వంటి షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో, రియాల్టీ రంగం షేర్లు 1-2 శాతం మేర పడిపోయాయి. లోహ రంగం షేర్లలో మాత్రం కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్ సూచీలు దాదాపు అన్నీ నష్టాలే నమోదుచేశాయి. ​

లాభనష్టాల్లో ఇవే..

హిందాల్కో, ఓఎన్​జీసీ, సన్​ ఫార్మా, దివిస్​ ల్యాబ్స్​, ఏషియన్​ పెయింట్స్​ రాణించాయి.

ఎన్​టీపీసీ, హీరో మోటోకార్ప్​, ఎస్​బీఐ, ఎం అండ్​ ఎం, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: అవసరానికి అక్కరకు వచ్చే 'డెట్​' పథకాలు

ఇలా చేస్తే క్రెడిట్‌ స్కోరు 750కి తగ్గదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.