ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లకు స్వల్ప నష్టాలు

author img

By

Published : Dec 29, 2021, 3:43 PM IST

Stock Market Update
Stock Market Update

Stock Market today: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయింది. మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయింది.

Stock Market Update: ఆద్యంతం ఊగిసలాడిన స్టాక్ ​మార్కెట్​ సూచీలు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్​గా ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 91 పాయింట్ల నష్టం పోయి.. 57,806 వద్ద స్థరపడింది. మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ.. 20 పాయింట్లు కోల్పోయి.. 17,213 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

ఉదయం 57,892 వద్ద ఫ్లాట్​గా ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 58,097 పాయింట్ల అత్యధిక స్థాయిని చేరి.. ఒకదశలో 57,684 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 17,286 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 17,176 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాలోనివివే..

సన్​ఫార్మా, ఇండస్​ఇండ్​బ్యాంకు, డాక్టర్​రెడ్డీస్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, టైటాన్​, నెస్లే, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.

ఎస్​బీఐఎన్​, ఐటీసీ, టెక్​మహీంద్రా, ఎన్​టీపీసీ, యాక్సిస్​ బ్యాంకు, టాటాస్టీల్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇదీ చూడండి: Indian music on flights: విమానాల్లో ఇకపై భారతీయ సంగీతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.