ETV Bharat / business

రిలయన్స్​ జోరు- లాభాలతో ముగిసిన మార్కెట్లు

author img

By

Published : Jul 13, 2020, 4:34 PM IST

రిలయన్స్​ షేర్లు రికార్డు స్థాయికి చేరడం, అంతర్జాతీయంగా సానుకూలతల కారణంగా స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 99 పాయింట్లు వృద్ధి చెంది 36,693కు చేరింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడింది.

Sensex rises 99 pts; RIL hits record high
రిలయన్స్​ జోరు.. లాభాలతో ముగిసిన మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. రిలయన్స్​ షేర్ల రికార్డు ముగింపు, అంతర్జాతీయంగా సానుకూలతల ప్రభావం సూచీలపై కనిపించింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 34 పాయింట్లు వృద్ధి చెంది 10,802కు చేరింది.

రిలయన్స్​ షేర్ల హవా...

తమ సంస్థంలో క్వాల్​కమ్​ కంపెనీ రూ. 730కోట్ల పెట్టుబడులు పెడుతోందని రిలయన్స్​ ఆదివారం ప్రకటించింది. ఫలితంగా సోమవారం రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేర్లు.. 3శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో ముగిశాయి.

లాభనష్టాల్లోనివి ఇవే...

టెక్​ మహీంద్ర, హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, హిందుస్థాన్ యూనివర్​ లివర్​, ఐటీసీ, సన్​ఫార్మా, టాటా స్టీల్​ లాభాల బాటపట్టాయి.

టీసీఎస్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎల్​టీ, ఎన్​టీపీసీ, కోటక్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ నష్టపోయాయి.

రూపాయి...

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.19 వద్ద స్థిరపడింది.

చమురు...

అంతర్జాతీయ విపణిలో చమురు ధర 1.25 శాతం తగ్గి 42.70 డాలర్ల వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:- 2020-21లో దేశ వృద్ధి రేటు -4.5 శాతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.