ETV Bharat / business

ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు- షరతులు వర్తిస్తాయ్!

author img

By

Published : Feb 1, 2020, 1:12 PM IST

Updated : Feb 28, 2020, 6:39 PM IST

income tax
income tax

మధ్య, ఎగువ తరగతి వర్గాలకు ఊరటనిచ్చే పన్ను రేట్లను భారీగా తగ్గించింది కేంద్రం. ఈ మేరకు బడ్జెట్​లో ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఈ అంశంపై కొన్ని షరతులను పెట్టింది కేంద్రం. కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు ఆర్థిక మంత్రి.

ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు

ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా బడ్జెట్‌ 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా ఆదాయపన్ను స్లాబ్​లను 4 నుంచి 7కు పెంచింది.

నూతన స్లాబులు ఇవే..

income tax
ఆదాయ పన్ను రేట్లు

⦁ 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు.
⦁ 2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం
⦁ రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్నులు యథాతథం
⦁ 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం
⦁ 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం
⦁ 10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం
⦁ 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం
⦁ 15 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం

కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు ఆర్థిక మంత్రి. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మినహాయింపులు పొందేవారికి నూతన పన్ను రేట్లు వర్తించవని తెలిపారు.

ఈ కొత్త పన్ను రేట్లతో కేంద్రానికి రూ.40వేల కోట్లు ఆదాయం తగ్గనుందని చెప్పారు.

Last Updated :Feb 28, 2020, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.