ETV Bharat / business

క్యూ1లో జీడీపీ 20 శాతం జంప్​- కొవిడ్​ నుంచి తేరుకున్నట్టేనా?

author img

By

Published : Sep 1, 2021, 5:43 PM IST

Indian Economy
భారత జీడీపీ

కరోనా మొదటి దశలో విధించిన లాక్​డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో కుప్పకూలింది. అయితే రెండో దశలో మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. 2021-22 క్యూ1లో 20.1 శాతం వృద్ధి రేటు(gdp growth rate) నమోదవ్వటమే ఇందుకు ఉదాహరణ. మరి ఈ స్థాయి వృద్ధి రేటు నమోదయ్యేందుకు కారణాలు ఏమిటి? కొవిడ్ సంక్షోభం నుంచి భారత్ తేరుకున్నట్లేనా? విశ్లేషకులు ఏమంటున్నారు?

కరోనా రెండో దశ విజృంభణ కొనసాగినా.. దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 20.1 శాతంగా(gdp growth rate) నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం ఇటీవల వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయానికి తక్కువ బేస్​ ప్రాతిపదికన తయారీ, సేవా రంగాలు పుంజుకోవడం.. ఈ స్థాయి వృద్ధికి కలిసొచ్చిట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​(lockdown effect on indian economy) కన్నా స్థానికంగా.. అవసరం ఉన్నచోట మాత్రమే ఆంక్షలు​ విధించడం వల్ల ప్రయోజనాలు చేకూరినట్లు ఈ గణాంకాలు తేట తెల్లం చేస్తున్నాయి.

"భారీ స్థాయిలో జీడీపీ పుంజుకునేందుకు బెస్ ఎఫెక్ట్​ కారణం. కరోనా మొదటి దశ లాక్​డౌన్​ లో ఉన్నంత కఠినంగా రెండో దశలో ఆంక్షలు లేకపోవడం వల్ల ఈ స్థాయి వృద్ధి రేటుకు కలిసొచ్చింది."

- సునీల్​ సిన్హా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్​ ప్రధాన ఆర్థిక వేత్త

ఏ రంగం ప్రదర్శన ఎలా?

డిమాండ్ పరంగా నాలుగు ప్రధాన కాంపొనెంట్లలో.. మూడు (ప్రైవేటు వినియోగం, గ్రాస్​ ఫిక్స్​డ్​ క్యాపిటల్​ పార్మేషన్​, ఎగుమతులు) గత త్రైమాసికంలో సానుకూలంగా స్పందిస్తే.. దానిని డ్రివెన్ ఎకానమి అంటారు. పీఎఫ్​సీఈగా పరిగణించే ప్రైవేటు వినియోగం గత త్రైమాసికంలో 19.3 శాతంగా, గ్రాస్​ ఫిక్స్​డ్​ ఫార్మేషన్​ 55 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ప్రభుత్వ వ్యయాలు మాత్రమే గత త్రైమాసికంలో క్షీణతను నమోదు చేసిన కాంపొనెంట్​. ప్రభుత్వ వ్యయాలు ఏప్రిల్​-జూన్​ మధ్య 4.8 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సప్లయి పరంగా చూస్తే.. వ్యవసాయ రంగం 4.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. బేస్​ ఎఫెక్ట్​తో సంబంధం లేకుండానే ఈ స్థాయి వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 2020 ఇదే సమయంలో కరోనా మొదటి దశ సంక్షోభం సృష్టించినా.. ఈ రంగం 3.5 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది.

పారిశ్రామిక వృద్ధి భళా..

2021-22 క్యూ1లో వ్యవసాయం కన్నా పారిశ్రామిక రంగం ఇంకా మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్​ ప్రధాన ఆర్థికవేత్త సునిల్ సిన్హా పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా కూడా ఇది నిలిచినట్లు తెలిపారు.

పారిశ్రామిక రంగం ఈ ఏడాది ఏప్రిల్​-జూన్ మధ్య 46 శాతం పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెగ్మెంట్ల వారీగా చూస్తే.. నిర్మాణ (68.3 శాతం), తయారీ (49.6 శాతం), మైనింగ్​ (18.6 శాతం), విద్యుత్​, యుటిలిటీ సేవలు (14.3 శాతం) సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

భారీ వృద్ధి రేటు అయినా అది తక్కువే..

తక్కు బేస్ ఎఫెక్ట్ కారణంగా పారిశ్రామిక రంగం(industrial growth in india) ఏప్రిల్​-జూన్ మధ్య 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే కరోనా సంక్షోభం లేని 2019-20తో పోలిస్తే వృద్ధి ఇంకా క్షీణత దశలోనే ఉండటం గమనార్హం.

డిమాండ్ వైపు కూడా.. ప్రైవేటు వినియోగం, గ్రాస్​ ఫిక్స్​డ్ క్యాపిటల్ ఫార్మెషన్​ కూడా వరుసగా.. (2019-20 క్యూ1తో పోలిస్తే) 11.9 శాతం, 17.1 శాతం క్షీణత దశలోనే ఉన్నాయి.

దీని ప్రకారం చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 వృద్ధి రేటు.. 2019-20తో పోలిస్తే ఇంకా 9.2 శాతం తక్కువగానే ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

సేవా రంగంపై ఒత్తిడి..

దేశీయంగా అత్యంత ముఖ్యమైన కాంపోనెంట్​లలో ఒకటిగా పరిగణించే సేవా రంగంపై ఇంకా ఒత్తిడి(service sector in india gdp) ఉన్నట్లు సునీల్ సిన్హా అన్నారు. బేస్ ఎఫెక్ట్​తో సంబంధం లేకుండా.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో సేవా రంగం 11.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లు వివరించారు.

అయితే హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్​ వంటి విభాగాలు ఇతర కాంపోనెంట్లతో పోలిస్తే కాస్త సానుకూల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు సిన్హా. ఈ విభాగాలన్ని 34.3 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.