పాన్ కార్డు, ఆధార్ అనుసంధాన(aadhar pan card link) గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా గడువును మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30ని తాజా గడువుగా పేర్కొంది. గతంలో విధించిన గడువు జూన్ 30తో ముగస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది.
పాన్- ఆధార్కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొన్నారు. తర్వాత దాన్ని 2020 జూన్ 30కి, తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం ఈ ఏడాది జూన్ 30కి.. ఇలా గడువును కేంద్రం పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది.
వివాద్ సే విశ్వాస్ పథకం గడువును కూడా మరో రెండు నెలలు.. అంటే ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫారం-16 గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఇదీ చదవండి: కొవిడ్ పరిహారంపై పన్ను మినహాయింపు