ETV Bharat / business

జీఎస్​టీ వసూళ్లు@ రూ.5.48 లక్షల కోట్లు!

author img

By

Published : Apr 13, 2021, 2:14 PM IST

Updated : Apr 13, 2021, 3:03 PM IST

పరోక్ష పన్నులుగా పిలిచే.. జీఎస్​టీ, కస్టమ్స్ సుంకాలు, ఎక్సైంజ్​, సర్వీస్​ ట్యాక్స్​ల వసూళ్లు భారీగా పెరిగాయి. 2020-21లో మొత్తం రూ.10.71 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

Indirect tax revenue up
భారీగా పెరిగిన పరోక్ష పన్నుల ఆదాయం

కరోనా సంక్షోభంలోనూ పరోక్ష పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2020-21లో మొత్తం రూ.10.71 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం 12.3 శాతం ఎక్కువ. 2019-20లో రూ.9.54 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి.

బడ్జెట్​లో సవరించిన అంచనాలకన్నా కూడా ఈ వసూళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

వసూళ్ల లెక్క..

  • జీఎస్​టీ రూ.5.48 లక్షల కోట్లు
  • కస్టమ్స్ సుంకాలు రూ.1.32 లక్షల కోట్లు
  • సెంట్రల్ ఎక్సైజ్​, సర్వీస్​ ట్యాక్స్​ రూ.3.91 లక్షల కోట్లు

ఇదీ చదవండి:'ఏడాదికి 85 కోట్ల 'స్పుత్నిక్​-వి' డోసుల ఉత్పత్తి'

Last Updated :Apr 13, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.