జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్! శుక్రవారం నిర్ణయం!!

author img

By

Published : Sep 14, 2021, 5:54 PM IST

Updated : Sep 14, 2021, 7:51 PM IST

GST council

జీఎస్​టీ మండలి 45వ సమావేశం ఈ శుక్రవారం జరగనుంది. కొవిడ్ విజృంభణ తర్వాత జరగనున్న తొలి ప్రత్యక్ష భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్​ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే అంశం చర్చకు రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 17న(శుక్రవారం) జీఎస్​టీ మండలి 45వ సమావేశం జరగనుంది. కరోనా విజృంభణ తర్వాత ప్రత్యక్షంగా జరనున్న తొలి సమావేశం ఇదే కానుంది. ఈ సారి భేటీలో పెట్రోల్​, డీజిల్​ సహా ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే అంశం పరిశీలనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆమోదం లభిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

దీనితో పాటు.. కొవిడ్ అత్యవసరాలపై జీఎస్​టీ మిహహాయింపును ఇంకొన్నాళ్లు పొడిగించే అంశంపై కూడా కౌన్సిల్​ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

జీఎస్​టీ (వస్తు సేవల పన్ను) 2017 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే వ్యాట్​ వంటివాటిని ఒక దగ్గర చేర్చి.. అమలులోకి తెచ్చిందే జీఎస్​టీ. అన్ని వస్తు సేవలకు దీనిని వర్తింపజేసిప్పటికీ.. పెట్రోల్​, డీజిల్​, ఏటీఎఫ్​, సహజ వాయువు, ముడి చమురు వంటి వాటిపై మాత్రం పాత పన్నుల విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది కేంద్రం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై సుంకాల ద్వారా అధికంగా ఆదాయాన్ని గడిస్తున్నాయి. అందుకే వీటిని జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే సాహసం చేయలేకపోయాయి.

ఇదీ చదవండి: TATA Stryder bikes: ఒకసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ. ప్రయాణం

Last Updated :Sep 14, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.