ETV Bharat / business

మళ్లీ రూ.90 వేల కోట్లు దాటిన జీఎస్​టీ వసూళ్లు

author img

By

Published : Jul 1, 2020, 12:45 PM IST

జీఎస్​టీ వసూళ్లు జూన్​లో భారీగా పెరిగాయి. లాక్​డౌన్​ సడలింపులతో పన్ను వసూళ్లు తిరిగి రూ.90 వేల కోట్లు దాటాయి. గత నెల పన్నుల వసూళ్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇలా ఉన్నాయి.

gst collection rise in June
జూన్​లో పెరిగిన జీఎస్​టీ వసూళ్లు

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ సడలింపులతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. ఫలితంగా వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు జూన్​లో రూ.90,917 కోట్లకు పెరిగాయి. అంతకు ముందు లాక్​డౌన్​ కారణంగా మేలో రూ.62,009 కోట్లు, ఏప్రిల్​లో అత్యల్పంగా రూ.32,294 కోట్ల పన్నులు మాత్రమే వసూలయ్యాయి.

జూన్​ జీఎస్​టీ లెక్కలు..

  • కేంద్ర జీఎస్​టీ - రూ.18,980 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ -రూ.23,970 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ -రూ.40,302 కోట్లు
  • సెస్​- రూ.7,665 కోట్లు

ఇదీ చూడండి:విమాన సంస్థలకు షాక్​.. ఏటీఎఫ్ ధరలు పైపైకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.