ETV Bharat / business

8 నెలల తర్వాత రూ.లక్ష కోట్లపైకి జీఎస్​టీ వసూళ్లు

author img

By

Published : Nov 1, 2020, 12:19 PM IST

అక్టోబర్​లో జీఎస్​టీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇదే ప్రథమం. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే జీఎస్​టీ ఆదాయం 10 శాతం పెరిగింది.

GST collections cross Rs 1 lakh cr
అన్​లాక్​తో పెరిగిన జీఎస్​టీ వసూళ్లు

దేశవ్యాప్తంగా అన్​లాక్​తో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలతో వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. అక్టోబర్​లో మొత్తం జీఎస్​టీ వసూళ్లు రూ.1,05,155 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత జీఎస్​టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇదే ప్రథమం.

గతేడాది అక్టోబర్​తో పోలిస్తే జీఎస్​టీ వసూళ్లు ఈ సారి 10 శాతం పెరిగాయి.

అక్టోబర్ జీఎస్​టీ వసూళ్ల లెక్క..

  • కేంద్ర జీఎస్​టీ - రూ.19,193 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ -రూ.25,411 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ -రూ.52,540 కోట్లు
  • సెస్​- రూ.8,011 కోట్లు

ఇదీ చూడండి:'పంట, ట్రాక్టర్ రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.