ETV Bharat / business

'రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల విలువైన రహదారులు'

author img

By

Published : May 7, 2020, 11:03 PM IST

Gadkari
త్వరలోనే ఆటో స్క్రాపింగ్​ పాలసీ: గడ్కరీ

కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన ఆటో రంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. ఈ మేరకు సియామ్​ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. త్వరలోనే ఆటో స్క్రాపింగ్​ పాలసీ ఖరారవుతుందని తెలిపారు.

రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తెలిపారు. ఆటో స్క్రాపింగ్​ విధానం కూడా త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆటోమొబైల్​ రంగంపై కరోనా మహమ్మారి ప్రభావానికి సంబంధించి భారతీయ ఆటోమొబైల్​ తయారీదారుల సంఘం (సియామ్​) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు గడ్కరీ. వ్యాపారంలో ఎత్తుపల్లాలు సాధారణమేమని.. ద్రవ్య లభ్యతను పెంచటంపై దృష్టి సారించాలని సూచించారు.

" అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలంటే.. ఆటో పరిశ్రమ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికత, పరిశోధన నైపుణ్యత పై దృష్టి సారించాలి. వచ్చే రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల విలువైన రహదారులు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. మధ్యవర్తిత్వ కేసుల పరిష్కారానికి మా శాఖ ఓవర్​ టైం పని చేస్తోంది. ఆటో స్క్రాపింగ్​ విధానాన్ని త్వరగా ఖరారు చేయాలని అధికారులను ఆదేశించాం. ఖర్చు తగ్గింపు విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది."

– నితిన్​ గడ్కరీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి.

అన్ని విధాలా సాయం..

బీఎస్​-4 వాహనాల విషయమై అడిగిన ప్రశ్నకు.. సుప్రీం కోర్టు తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గడ్కరీ. అయితే.. పరిశ్రమ వర్గాల వినతి మేరకు ఈ అంశాన్ని తిరిగి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇతర నిబంధనల సడలింపుల విషయంలో సాధ్యమైన చోట ఉపశమనం కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ నుంచి అన్ని విధాల సాయం అందుతుందని భరోసా కల్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.