ETV Bharat / business

రిలయన్స్ ఢమాల్- మూడు నెలల కనిష్ఠానికి షేర్లు

author img

By

Published : Nov 2, 2020, 12:06 PM IST

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్ల సెషన్ ఆరంభం నుంచే ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంస్థ షేర్లు ప్రస్తుతం 5 శాతానికిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.

why reliance shares falling
రిలయన్స్ షేర్లు కుదేలు

స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోయాయి. కరోనా కాలంలోనూ వరుస పెట్టుబడులతో రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకిన సంస్థ షేర్లు సోమవారం 5 శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతున్నాయి. దీనితో సంస్థ షేరు విలువ దాదాపు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది.

బీఎస్​ఈలో రిలయన్స్ షేరు విలువ ప్రస్తుతం 5.12 శాతం నష్టంతో రూ.1,949 వద్ద ట్రేడవుతోంది.

ఎన్​ఎస్​ఈలోనూ రిలయన్స్ షేరు 5.14 శాతం పడిపోయింది. ఒక షేరు విలువ ప్రస్తుతం రూ.1,949 వద్ద కొనసాగుతోంది.

షేర్లు భారీగా పడిపోయిన కారణంగా సంస్థ ఎం క్యాప్​ (బీఎస్​ఈలో) రూ.68,093.52 కోట్లు తగ్గి.. రూ.13,21,302.15 కోట్లకు చేరింది.

నష్టాలకు కారణం..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ నికర లాభం 15 శాతం తగ్గినట్లు గత శుక్రవారం ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ నేపథ్యంలో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఇదీ చూడండి:అక్టోబర్​లో మారుతీ, హ్యుందాయ్​ జోరు.. రెండంకెల వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.