ETV Bharat / business

ఐపీఓ కోసం అతి త్వరలోనే ఎల్​ఐసీ దరఖాస్తు

author img

By

Published : Oct 3, 2021, 1:08 PM IST

ఎల్​ఐసీ ఐపీఓకు (LIC IPO update) సంబంధించి మరో కీలక అప్​డేట్ వచ్చింది. వచ్చే నెలలోనే సెబీకి ఎల్​ఐసీ ఐపీఓ దరఖాస్తు (LIC IPO DRHP) సమర్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

LIC IPO updates
ఎల్​ఐసీ ఐపీఓ అప్​డేట్స్​

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్​ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ (ఐపీఓ)కు (LIC IPO update) సంబంధించి మరో కీలక అప్​డేట్ వెలువడింది. నవంబర్​లోపు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి ఎల్​ఐసీ ఐపీఓ కోసం దరఖాస్తు (డీఆర్​హెచ్​పీ​) చేసుకునే (LIC IPO DRHP) వీలుందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది.

'ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్​ఐసీ ఐపీఓ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా నవంబర్​లోపు డీఆర్​హెచ్​పీ​ దాఖలు చేసే అవకాశాలున్నాయి' అని ఆర్థిక శాఖ ఉన్నాతాధికారి పేర్కొన్నారు.

ఐపీఓను నిర్వహించే బ్యాంకులు ఇవే..

ఎల్​ఐసీ ఐపీఓ కోసం ప్రభుత్వం గత నెలలోనే పది మర్చెంట్​ బ్యాంకర్లను నియమించింది. గోల్డ్​మన్​ శాక్స్​ (ఇండియా) సెక్యూరిటీస్​ ప్రైవేట్ లిమిటెడ్​, సిటీగ్రూప్​ గ్లోబల్​ మార్కెట్స్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​, నోమురా ఫినాన్షియల్ అడ్వైసరీ అండ్ సెక్యూరిటీస్​ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్​ ఈ ఐపీఓను నిర్వహించనున్నాయి.

ఎస్​బీఐ క్యాపిటల్ మార్కెట్​ లిమిటెడ్​, జేఎం ఫినాన్షియల్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్​ లిమిటెడ్​, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్​, జేపీ మోర్గాన్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ లిమిటెడ్​, కోటక్ మహీంద్రా క్యాపిటల్​ కో లిమిటెడ్​ ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకుల జాబితాలో ఉన్నాయి.

సిరిల్ అమర్​చంద్​ మంగళ్​దాస్ ఎల్​ఐసీ ఐపీఓకు న్యాయ సలహాదారుగా వ్యవహరించనుంది.

ఐపీఓ కోసం సెబీకి ఎల్​ఐసీ దరఖాస్తు చేసుకుంటే.. మర్చెంట్​ బ్యాంకర్లు అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రచారం ప్రారంభిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఓపై మదుపరుల్లో ఆసక్తి..

'ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌ఐసీ ఐపీఓకు వస్తే.. భారీ స్పందన కచ్చితంగా ఉంటుంది. సంస్థాగత మదుపరులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రజల్లోనూ ఈ సంస్థపై విశ్వాసం ఎక్కువే. ఐపీఓకు దరఖాస్తు చేయడం కోసం మార్కెట్లో ఇతర కంపెనీల షేర్లలో ఉన్న డబ్బు ఉపసంహరించుకుని, ఎల్‌ఐసీ ఇష్యూకు దరఖాస్తుకు కేటాయించే అవకాశాలూ లేకపోలేదు' అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎల్​ఐసీ ఐపీఓ ఎందుకు?

ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా.. ఎల్​ఐసీని ఐపీఓకు తీసుకరావాలని కేంద్రం నిర్ణయించింది. రెండు దశల్లో మొత్తం 10 శాతం వాటను ఐపీఓ ద్వారా విక్రయించే వీలుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ ఐపీఓకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు లభించాయి.

ఎల్​ఐసీ ఐపీఓ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిపోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లిస్టింగ్ తర్వాత అతిపెద్ద కంపెనీ కూడా ఇదే కానుందని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.