ETV Bharat / business

జనవరిలోనూ రూ.లక్ష కోట్లకు జీఎస్టీ వసూళ్లు

author img

By

Published : Feb 1, 2020, 10:26 AM IST

Updated : Feb 28, 2020, 6:12 PM IST

పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెంచాలన్న కేంద్రం ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. 2020 జవవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్​ దాటడం వరుసగా ఇది మూడో నెల.

GST
జీఎస్టీ

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెలలోనూ రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది జనవరిలో రూ.1,10,828 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది.

ఇందులో దేశీయ వసూళ్ల వాటా రూ.86,453 కోట్లు, ఐజీఎస్టీ, సెస్సుల వాటా రూ.23,597 కోట్లుగా ఉన్నాయి.

గత ఏడాది డిసెంబర్​లో జీఎస్టీ వసూళ్లు రూ.1.03 కోట్లుగా ఉండటం గమనార్హం.

జనవరి 30 నాటికి మొత్తం 82.8 లక్షల జీఎస్టీఆర్​ 3బీ రిటర్నులు దాఖలైనట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.

వసూళ్ల లెక్కలు..

  • కేంద్ర జీఎస్టీ రూ.20,944 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్టీ రూ.28,224 కోట్లు
  • సమీకృత​ జీఎస్టీ రూ.53,013 కోట్లు
  • సెస్ రూ.8,637 కోట్లు
  • మొత్తం రూ.1,10,828 కోట్లు

ఇదీ చూడండి:ఈ నలుగురు నిర్వహిస్తున్న కంపెనీల విలువెంతంటే..!

Last Updated : Feb 28, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.