భారత అంకురాల్లో 12 రెట్లు పెరిగిన చైనా పెట్టుబడులు

author img

By

Published : Jun 27, 2020, 4:28 PM IST

china investments rise 12 times in India

భారత అంకుర సంస్థలపై చైనా కంపెనీల పెట్టుబడులు ఇటీవల భారీగా పెరిగాయి. 2016తో పోలిస్తే 2019 నాటికి భారతీయ అంకురాల్లో చైనా పెట్టుబడులు ఏకంగా 12 రెట్లు పెరిగినట్లు ఓ నివేదికలో వెల్లడైంది.

భారత కంపెనీల్లో చైనా పెట్టుబడులు నాలుగేళ్లలో 12 రెట్లు పెరిగాయి. 2019లో ఏకంగా 4.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు ప్రముఖ పరిశోధన సంస్థ గ్లోబల్​డేటా తాజా నివేదికలో వెల్లడైంది. 2016లో చైనా పెట్టుబడుల మొత్తం 381 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

భారత్​కు వచ్చిన ఈ పెట్టుబడుల్లో 17 నుంచి 24 శాతం చైనాకు చెందిన రెండు దిగ్గజ సంస్థలు అలీబాబా, టెన్​సెంట్​ల నుంచి వచ్చినట్లు ఈ నివేదిక వివరించింది.

అలీబాబాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఆంట్ ఫినాన్షియల్​ సహా ఇతర సంస్థలు.. ప్రముఖ అంకురాలైన పేటీఎం, స్నాప్​డీల్, బిగ్​బాస్కెట్, జొమాటో వంటి సంస్థల్లో 2.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయి. టెన్​సెంట్ సహా మరిన్ని చైనా సంస్థలు ఓలా, స్విగ్గీ, హైక్, డ్రీమ్​ 11, బైజూస్ వంటి సంస్థల్లో 2.4 బిలియన్​ డాలర్ల వరకు పెట్టుబడిగా పెట్టాయని నివేదిక అంచనా వేసింది.

ఇదీ చూడండి:ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​కు రూ.54 వేల కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.