చరిత్రలో తొలిసారి.. 200ఎంపీ కెమెరాతో స్మార్ట్​ఫోన్!

author img

By

Published : Jul 14, 2021, 3:35 PM IST

xiaomis-next-gen-flagship-model-mi-12-will-feature-a-200mp-camera

స్మార్ట్​ఫోన్ వినియోగదారులు నభూతో నభవిష్యత్ అనేలా 200 మెగా పిక్సెల్ కెమెరాతో ఎంఐ 12ను రూపొందిస్తోంది షియోమీ. అధునాతన స్నాప్​డ్రాగన్ చిప్​సెట్​ను కూడా వినియోగించే ఈ ఫ్లాగ్​షిప్​ మోడల్​ను ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఇప్పటికే ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్ట్రా మోడళ్లతో స్మార్ట్​ఫోన్​ వినియోగదారులను ఆకర్షిస్తోంది చైనా దిగ్గజ మొబైల్ సంస్థ షియోమీ. తన తదుపరి మోడల్​లో 200 మెగాపిక్సెల్ కమెరాతో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఎంఐ12ను మార్కెట్లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఎంఐ 12లో అధునాతన స్నాప్​డ్రాగన్​ చిప్​సెట్​ను కూడా వినియోగించాలని షియోమీ భావిస్తోంది. గతేడాది స్నాప్​డ్రాగన్ 888​ 5జీ చిప్​సెట్​ను ప్రకటింటినప్పుడు.. దీన్ని వినియోగించిన తొలి సంస్థ కూడా షియోమీనే కావడం గమనార్హం. ఎంఐ 11 మోడల్​లో ఈ చిప్​సెట్​నే ఉపయోగించింది. అయితే క్వాల్​కామ్​ తొలి 4ఎన్​ఎం చిప్​సెట్​ స్నాప్​డ్రాగన్​ 895ను కూడా షియోమీనే మొదటగా ఎంఐ 12 మోడల్​లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

ఎల్​టీపీఓ(లో టెంపరేఛర్ పాలీక్రిస్టలిన్​ ఆక్సైడ్​)ను సపోర్ట్​ చేసే ఓఎల్​ఈడీ డిస్​ప్లేను ఎంఐ-12 మోడల్​లో వాడనున్నారు. దీనివల్ల రీఫ్రెష్ రేట్ తగ్గి బ్యాటరీ లైఫ్​ పెరుగుతుంది.

120 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్, 100 వాట్స్ వైర్​లెస్​ ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతతో ఎంఐ 12 బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎంఐ-12 ధర ఎంత ఉండవచ్చనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

ఇదీచూడండి: WPI inflation: తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.