ETV Bharat / business

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్ పదవీకాలం పొడిగింపు​

author img

By

Published : Oct 29, 2021, 8:21 AM IST

Updated : Oct 29, 2021, 9:09 AM IST

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది డిసెంబరు 12 నుంచి ఈ నియామకం అమలులో ఉంటుందని వెల్లడించింది.

rbi
శక్తికాంత్​ దాస్​

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ పదవి కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేబినెట్‌ అపాయింట్‌మెట్స్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఆర్​బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్‌ పదవి కాలం డిసెంబరు 10తో ముగియనుండగా తాజా నిర్ణయంతో అతడు మూడేళ్లపాటు లేదా కేంద్రం ఇచ్చే తదుపరి ఆదేశాల వరకు ఆయన అదే పదవిలో కొనసాగనున్నారు. డిసెంబరు 12 నుంచి ఈ నియామకం అమలులోకి రానుంది.

గతంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శక్తికాంత్​ దాస్​.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకులలో భారత ప్రత్యామ్నయ గవర్నర్‌గాను సేవలందించారు. 2018 డిసెంబర్‌ 11న మూడేళ్ల కాలానికి ఆర్​బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. మెరుగైన పనితీరును కనబర్చారు.

ఇదీ చూడండి : ట్రూకాలర్​తో భారతీయ రైల్వే డీల్.. ప్రయాణికులకు లాభాలివే...

Last Updated : Oct 29, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.