ETV Bharat / business

రిలయన్స్ మరో ఘనత.. టాప్​-50 కంపెనీల్లో చోటు

author img

By

Published : Jul 23, 2020, 7:54 PM IST

Reliance breaks into top 50 most valued cos globally, ranks 48
చరిత్ర సృష్టించిన రిలయన్స్..టాప్​-50 కంపెనీల్లో చోటు

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్​-50 కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. రూ.13లక్షల కోట్ల మార్కెట్ విలువ గల మొట్ట మొదటి భారత సంస్థగా అవతరించింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ మరో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల టాప్​-50 కంపెనీల జాబితాలో 48వ స్థానం దక్కించుకుంది. సంస్థ ఎం-క్యాప్​ రూ.13లక్షల కోట్లు దాటడం వల్ల ఇది సాధ్యమైంది.

గురువారం మార్కెట్​ ముగిసే సమయానికి రిలయన్స్ షేరు విలువ రూ.2060గా ఉంది. గత సెషన్​తో పోల్చితే 2.82శాతం వృద్ధి సాధించింది. ఫలితంగా కంపెనీ మార్కెట్​ విలువ రూ.13లక్షల కోట్లు దాటింది. ఇప్పటి వరకు భారత్​కు చెందిన ఏ ఇతర సంస్థ కూడా ఇంత మార్కెట్ విలువను సాధించలేకపోయింది.

1.7 ట్రిలియన్​ డాలర్ల మార్కెట్ విలువతో సౌదీ అరేబియాకు చెందిన ఆరాంకో సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువై కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్​, మైక్రోసాఫ్ట్, అమెజాన్​, ఆల్ఫాబెట్ ఉన్నాయి.

రిలయన్స్​తో పాటు భారత్​ నుంచి టీసీఎస్​ మాత్రమే టాప్​-100 కంపెనీల జాబితాలో ఉంది.

అత్యధిక ఎం-క్యాప్​ విలువ గల ఆసియా కంపెనీల్లో 10వ స్థానంలో ఉంది రిలయన్స్​. చైనాకు చెందిన అలీబాబా కంపెనీ 7వ స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: రికార్డు స్థాయికి బంగారం ధర- 10 గ్రాములు ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.