ETV Bharat / business

వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్​ ధరలు

author img

By

Published : Feb 13, 2021, 8:17 AM IST

petrol-diesel-prices
వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్​ ధరలు

దేశంలో పెట్రోల్​ ధరల పెరుగుదల వరుసగా ఐదో రోజూ కొనసాగింది. పెట్రోల్​, డీజిల్​పై లీటరుకు సుమారు 39 పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.

వరుసగా ఐదో రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ నెలలోనే ధరల పెరగటం ఇది ఏడోసారి. పెట్రోలు, డీజిల్​పై లీటరుకు 39 పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.

దిల్లీలో లీటరు పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై​ 36 పైసలు పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 88.44, డీజిల్ రూ. 78.74కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు రూ. 94.93, డీజిల్ రూ. 85.70కు చేరింది.

గడిచిన 44 రోజుల్లో 17 సార్లు ధరలు పెంచాయి చమురు సంస్థలు. దీంతో సామాన్యుడిపై పెనుబారం పడుతోంది.

ఇదీ చూడండి: ఖాతాల తొలగింపునకు తలొగ్గిన ట్విట్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.