ETV Bharat / business

Fuel Price Today: ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

author img

By

Published : Oct 29, 2021, 7:21 AM IST

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

fuel price today
ఇంధన ధరలు

దేశంలో చమురు ధరలపై పెంపు కొనసాగుతోంది. ఇంధన ధరలు మరోసారి పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 35పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) తెలిపాయి.

దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.64కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.38కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 34 పైసలు పెరిగి (Mumbai Petrol Price Today) రూ.114.44కు చేరగా.. లీటర్​ డీజిల్ 37 పైసలు పెరిగి​​ రూ.105.45 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Petrol Price Today) ధర 33 పైసలు పెరిగి రూ.109.08గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.45 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి (Chennai Petrol Price Today) రూ.105.40 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు రూ.101.55కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.112.96కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.18 కి చేరింది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు రూ.114.95కి చేరింది. డీజిల్​పై 37 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.56 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.113.68 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.33కి చేరింది.

ఇదీ చూడండి : భారత్​లో పసిడికి భారీగా పెరిగిన డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.