ETV Bharat / business

Fuel Price Today: మరోసారి పెరిగిన చమురు ధరలు

author img

By

Published : Oct 30, 2021, 7:27 AM IST

దేశంలో చమురు ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

petrol price today
మరోసారి పెరిగిన చమురు ధరలు

దేశంలో పెట్రోల్​, డీజిల్​పై ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా లీటర్​కు 35 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) చమురు సంస్థలు ప్రకటించాయి.

దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.99కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.73కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 33 పైసలు పెరిగి (Mumbai Petrol Price Today) రూ.114.77కు చేరగా.. లీటర్​ డీజిల్ 38 పైసలు పెరిగి​​ రూ.105.83 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Petrol Price Today) ధర 34 పైసలు పెరిగి రూ.109.42గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.80 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి (Chennai Petrol Price Today) రూ.105.70 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు రూ.101.88కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.56 కి చేరింది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు రూ.115.30కి చేరింది. డీజిల్​పై 36 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.69కి చేరింది.

ఇదీ చూడండి : ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? ఈ పని చేయాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.