ETV Bharat / business

Fuel Price Today: పెట్రో మోత- మళ్లీ పెరిగిన చమురు ధరలు

author img

By

Published : Oct 28, 2021, 8:19 AM IST

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

fuel price today
పెట్రోల్​ ధరలు

దేశంలో 'పెట్రో' బాదుడు కొనసాగుతోంది. మరోసారి ఇంధన ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 35 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) తెలిపాయి.

దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.29కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.09కు ఎగబాకింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 34 పైసలు పెరిగి (Mumbai Diesel Price Today) రూ.114.10కు చేరగా.. లీటర్​ డీజిల్ 37 పైసలు పెరిగి​​ రూ.105.08 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Today Diesel Price) ధర 34 పైసలు పెరిగి రూ.108.75గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.10 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 31 పైసలు పెరిగి (Chennai Diesel Price Today) రూ.105.10 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు రూ.101.22కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.112.59కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.80 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​కు రూ.114.60కి చేరింది. డీజిల్​పై 37 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.19 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.113.33 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.105.96కి చేరింది.

ఇదీ చూడండి : రేషన్​ దుకాణాల ద్వారా వంట గ్యాస్ సిలిండర్ల విక్రయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.