ETV Bharat / business

పాన్- ఆధార్ అనుసంధానానికి మార్చి వరకు గడువు

author img

By

Published : Jul 6, 2020, 4:20 PM IST

పన్ను చెల్లింపుదారులు పాన్​తో ఆధార్ అనుసంధానించుకునేందుకు ఆదాయపు పన్ను విభాగం మరోసారి గడువు పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశమిచ్చింది.

pan aadhar link last date
పాన్​కు ఆధార్ అనుసంధానం గడుపు పెంపు

పాన్‌- ఆధార్ అనుసంధానానికి మరో సారి గడుపు పెంచింది ఆదాయ పన్ను విభాగం (ఐటీ). ఈ సారి ఏకంగా వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ గడువును పొడిగించింది.

ఇప్పటికే పలుమార్లు గడువు పెంచగా.. చివరి సారి జూన్ 30ని ఇందుకు తుది గడువుగా నిర్ణయించింది. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ ప్రకటించింది. ఈ గడువు లోపు పాన్​- ఆధార్​ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:ఆధార్ ఉందా.. 'పాన్'​ సులభంగా పొందండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.