ETV Bharat / business

16న ఆర్​బీఐ భేటీలో సీతారామన్​ ప్రసంగం

author img

By

Published : Feb 14, 2021, 4:06 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 16న ఆర్​బీఐ సెంట్రల్​ బోర్డ్​ బడ్జెట్ అనంతర భేటీలో ప్రసంగించనున్నారు. ఇందులో ఆమె ఆర్థిక ఏకీకరణ ప్రణాళిక గురించి వివరించే అవకాశముంది.

fiscal consolidation roadmap by Nirmala Sitharaman
ఆర్​బీఐ సెంట్రల్​ బోర్డ్ సమావేశంలో సీతారామన్​ ప్రసంగం

ఆర్​బీఐ సెంట్రల్​ బోర్డ్​ బడ్జెట్ అనంతర సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (ఫిబ్రవరి 16న) ప్రసంగించనున్నారు. ఇందులో బడ్జెట్​ 2021-22 ముఖ్యాంశాలను, ఆర్థిక ఏకీకరణకు ప్రణాళికను వివరించే అవకాశముంది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా తొలిసారి ఈ సమావేశం వర్చువల్​గా జరగనుంది.

కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాలు ఆదాయాన్ని మించి భారీగా పెరిగాయి. ఫలితంగా ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతానికి పెరగొచ్చని అంచనాలున్నాయి. 2021-22లో ఇది 6.8 శాతంగా నమోదవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇది 4.5 శాతానికి దిగొస్తుందని అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి:'కొవిడ్ కాదు.. ఆ వ్యాధులపైనే బడ్జెట్ దృష్టి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.