ETV Bharat / business

ఇన్ఫోసిస్​కు నిర్మలా సీతారామన్​ డెడ్​లైన్​.. కారణమిదే!

author img

By

Published : Aug 23, 2021, 9:11 PM IST

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​కు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ డెడ్​లైన్​ విధించారు. ఆదాయపు పన్ను పోర్టల్​లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్​ 15లోపు పరిష్కరించాలని కోరారు.

nirmala seetharaman
నిర్మలా సీతారామన్​

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్​కు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ డెడ్​లైన్​ విధించారు. ఆదాయపు పన్ను విభాగం కొత్త వెబ్‌సైట్​లో నెలకొన్న సమస్యలను సెప్టెంబర్​ 15 లోపు పరిష్కరించాలని కోరారు. సంస్థ పనితీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్​ పరేఖ్​కు స్పష్టం చేశారు.

ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణలో చిక్కులు తొలగించి, పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు కేంద్రం ఈ వెబ్‌సైట్‌ను తీసుకువచ్చింది. అయితే పోర్టల్​లో సాంకేతిక సమస్యలు వెల్లువెత్తాయి. వాటిని సరిదిద్దే బాధ్యతను ఇన్ఫోసిస్​కు అప్పగించింది. ఈ నేపథ్యంలో రెండు నెలలు గడిచినా.. పోర్టల్​లో సాంకేతిక సమస్యలు అలానే కొనసాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు కారణాలను వివరించాలని కోరింది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15లోపు పన్ను చెల్లింపులు సక్రమంగా జరిగేలా పోర్టల్​ను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది ఆర్థికశాఖ. దీనిపై స్పందించిన ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్​ పరేఖ్.. పోర్టల్​లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 750 మంది ఈ ప్రాజెక్ట్​పై పని చేస్తున్నట్లు వివరించారు. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇన్ఫోసిస్ వేగంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఆస్తుల వేలం- రూ. 6లక్షల కోట్ల సమీకరణే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.