ETV Bharat / business

పసిడి ప్రియం.. భారీగా దిగొచ్చిన వెండి

author img

By

Published : Nov 4, 2020, 4:51 PM IST

పసిడి ధర వరుసగా పెరుగుతూ వస్తోంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర బుధవారం రూ.110కి పైగా పెరిగింది. వెండి మాత్రం భారీగా తగ్గి.. రూ.61 వేల మార్క్ దిగువకు చేరింది.

Today Gold price
నేటి బంగారం ధర

బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.111 ఎగిసి.. రూ.50,743 వద్దకు చేరింది.

ఇటీవల వరుసగా రూపాయి విలువ తగ్గుతుండటం.. పసిడి ధరల పెరుగుదలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా పసిడి ధరలపై పడిందని అంటున్నారు.

పుత్తడికి వ్యతిరేకంగా వెండి ధర మాత్రం కిలోకు భారీగా రూ.1,266 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.60,669 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,895 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 23.60 డాలర్లకు దిగొచ్చింది.

ఇదీ చూడండి:మార్కెట్లకు మళ్లీ లాభాలు- ఐటీ, ఫార్మా జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.