Gold Price Today: తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Dec 1, 2021, 9:40 AM IST

Gold price

Gold Price Today: బంగారం, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరల్లో కొద్దిపాటి మార్పులు జరిగాయి. కాగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.200 తగ్గింది. పసిడి బాటలో పయనించిన వెండి ధర రూ.77 దిగొచ్చింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.49,130గా ఉంది. కిలో వెండి ధర రూ.63,683 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.49,130 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,683గా ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,130గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,683 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,779.40 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.88 డాలర్లగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: 5జీపై టెల్కోల పెట్టుబడులు రూ.1.8 లక్షల కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.