ETV Bharat / business

భారీగా పెరిగిన వెండి ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Oct 21, 2021, 10:07 AM IST

Gold price today
బంగారు, వెండి ధరలు

బంగారం ధర (Gold Rate Today) గురువారం పెరిగింది. వెండి ధర (Silver price today) కూడా మరింత ప్రిమయమైంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) కూడా ఏకంగా రూ.2,256 ఎగబాకింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.130 పెరిగి (Gold Price in Hyderabad) రూ.49,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,170వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,100గా ఉంది. కిలో వెండి ధర రూ.67,170 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,170 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,786 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇంధనలు ధరలు పెంపు

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్​కు (Petrol price hike) 35 పైసలు చొప్పున పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 36 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ ధర రూ.110.78కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​ రూ.103.90 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.112.48గా ఉంది. డీజిల్​ లీటర్​కు రూ.104.99 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్టణంలో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.22 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.103.76కి చేరింది

ఇదీ చూడండి: విమానాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.