Gold Rate Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Oct 18, 2021, 12:16 PM IST

gold price today

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) కూడా అదే బాటలో పయనించింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) సోమవారం స్వల్పంగా పెరిగింది. పుత్తడి మాత్రం కేవలం రూ. 100 పెరిగింది. వెండి ధర (Silver price today) ఏకంగా రూ.800 మేర ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి (Gold Price in Hyderabad) ధర రూ.48,811 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,799 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,805 గా ఉంది. కిలో వెండి ధర రూ.64,818 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.48,810 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,842 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,764 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇదీ చూడండి: ఏప్రిల్‌- సెప్టెంబరులో భారీగా పెరిగిన పసిడి దిగుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.