ETV Bharat / business

తగ్గిన బంగారం ధర- రూ. 48 వేల దిగువకు

author img

By

Published : Jun 17, 2021, 10:29 AM IST

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం తగ్గింది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. మరి ఆయా నగరాల్లో బంగారం ధరలు ఎంత ఉన్నాయి? పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయి? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

gold price
బంగారం ధర, పుత్తడి

బంగారం, వెండి ఫ్యూచర్స్​ గురువారం ఫ్లాట్​గా ట్రేడింగ్ ప్రారంభించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ​ (ఎంసీఎక్స్​)లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర 1.46 శాతం తగ్గి.. రూ.47,799 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా కిలో 1.59 శాతం తగ్గి రూ.70,332వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49,300 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.72,779 వద్ద ఉంది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్​లో.. పెట్రోల్ ధర లీటర్ రూ.100.52 వద్ద, డీజిల్ ధర రూ.95.33 వద్ద ఉంది.
గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.102.86 వద్ద, రూ.97.07 వద్ద ఉన్నాయి
వైజాగ్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.101.66 వద్ద ఉండగా.. లీటర్​కు ​ డీజిల్ ధర రూ.95.91గా ఉంది.

ఇదీ చదవండి:బంగారం కాస్త ప్రియం- పెట్రోల్​ రేట్ల కొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.