Gold rate today: పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే!

author img

By

Published : Sep 19, 2021, 10:26 AM IST

gold and silver rates

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today), వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోల్చుకుంటే ఆదివారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ. 47,696కు చేరింది. కిలో వెండి ధర రూ. 62 వేల మార్కుని తాకింది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,696గా ఉంది. కిలో వెండి ధర రూ.62 వేలకు చేరింది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.47,696గా ఉంది. కేజీ వెండి ధర రూ.62 వేల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,754 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.42 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.27 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇదీ చూడండి: రానున్న నెలల్లో ఐటీలో కొలువుల జాతరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.