ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

author img

By

Published : Jan 1, 2021, 4:04 PM IST

దేశీయంగా బంగారం ధర కాస్త తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.20 దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.400 పైగా క్షీణించింది.

Gold marginally lower; silver declines Rs 404 on new year's day
స్వల్పంగా తగ్గిన పసిడి ధర- దిగొచ్చిన వెండి

బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గుదల నమోదు చేసింది. దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.20 తగ్గి.. రూ.49,678కు చేరింది.

వెండి ధర భారీగా రూ.404 క్షీణించి.. కిలో వెండి రూ.67,520కు దిగొచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ పుత్తడి ధర పడిపోయింది. ఔన్సు బంగారం 1,895 డాలర్లు పలకగా.. ఔన్సు వెండి ధర 26.34 డాలర్లకు చేరింది.

"అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం వల్లే దేశీయంగానూ పసిడి ధరలు తగ్గాయి" అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: తొలి రోజే లాభాల పంట- నిఫ్టీ 14వేల ప్లస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.