ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Feb 4, 2021, 3:50 PM IST

బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.322 తగ్గగా.. కిలోవెండి ధర రూ.972 దిగొచ్చింది.

Gold declines for fourth consecutive trade; tumbles Rs 322
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.322 తగ్గి.. రూ.47,135కు చేరింది.

పసిడి బాటలోనే పయనించిన వెండి ధర రూ.972 తగ్గి.. కిలో రూ.67,170కు దిగొచ్చింది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, రూపాయి విలువ మెరుగుపడటం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,825 డాలర్లకు ఉండగా.. ఔన్సు వెండి ధర 26.61 గా ఉంది.

ఇదీ చూడండి: క్యూ3లో 7% తగ్గిన ఎస్​బీఐ నికర లాభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.