ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్​ ఆఫర్లకు​ నేడే లాస్ట్​​.. త్వరపడండి!

author img

By

Published : Oct 10, 2021, 2:12 PM IST

Flipkart offers
ఫ్లిప్​కార్ట్ , అమెజాన్​

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లు తీసుకొచ్చిన ప్రత్యేక ఆఫర్ల గడువు దాదాపు ముగింపు దశకు చేరుకుంది. పండుగ షాపింగ్​ చేయాలనుకునే వారు.. ఈ ఆఫర్లను వినియోగించుకునేందుకు చివరి తేదీ ఎప్పుడు? ఆయా సంస్థలు అందిస్తున్న ఆఫర్లు ఎలా ఉన్నాయి? అనే వివరాలు ఇవి..

పండుగ సీజన్​ నేపథ్యంలో దేశీయ ఈ కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ తీసుకొచ్చిన 'బిగ్​ బిలియన్​ డేస్​' ప్రత్యేక సేల్​ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ స్పెషల్​ సేల్​.. అక్టోబర్​ 10తో ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో ఫ్లిప్​కార్ట్​లో ఆఫర్లు ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకుందాం.

ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు ఇలా..

ఈ ప్రత్యేక సేల్​లో ఐఫోన్ 12 ధరను (iPhone offers on Flipkart) రూ.49,999కు తగ్గించింది ఫ్లిప్​కార్ట్​. ఐఫోన్ 12 మినీ ధరను రూ.38,999గా ఉంచింది. ఇక బడ్జెట్​ ఐఫోన్ ఎస్​ఈ (2020)ని రూ.26,999కే విక్రయిస్తోంది.

గూగుల్​ పిక్సెల్​ 4ఏ స్మార్ట్​ఫోన్​ ధరను రూ.31,999 నుంచి రూ.25,999కి తగ్గించింది ఫ్లిప్​కార్ట్​. దీనితో పాటు గూగుల్ బడ్స్​పై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

ఫోన్లతోపాటు టీవీలు, ఫ్రిడ్జ్​లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

సేల్ డిస్కౌంట్లతో పాటు.. యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ల ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా మరో 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుందని ఫ్లిప్​కార్ట్​ తెలిపింది. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే రూ.200 వరకు డిస్కౌంట్ లభించనుందని వెల్లడించింది.

అయితే ఈ ఆఫర్లన్ని ఆదివారం అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత కూడా పలు ఎంపిక చేసిన ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉండనున్నాయి.

అమెజాన్ ఆఫర్లు ఇలా..

మరో ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ కూడా.. అక్టోబర్​ 2 నుంచే 'గ్రేట్ ఇండియా ఫెస్టివల్​'సేల్​ను నిర్వహిస్తోంది. ఈ సేల్​లో అమెరికన్​ ఎక్స్​ప్రెస్​, సిటీ బ్యాంక్, ఆర్​బీఎల్​ బ్యాంక్​ల క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే 10 శాతం తక్షణ డిస్కౌంట్​ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. రూపీ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్​) ధరను రూ.25,999కి తగ్గించింది​ అమెజాన్​. దీని అసలు ధర రూ.29,999గా ఉంది. కూపన్ ద్వారా మరో రూ.1000 డిస్కౌంట్ పొందే వీలుంది.

ఐఫోన్ 11 (64 జీబీ) ధరను రూ.38,999గా నిర్ణయించింది అమెజాన్​.

రెడ్​మీ 50 4కే టీవీ ధరను రూ.44,999 నుంచి రూ.35,999కి తగ్గించింది. ఎక్స్ఛేంజ్​ ద్వారా మరింత డిస్కౌంట్ పొందే వీలుంది.

ఈ సేల్​ నడుస్తుండగానే.. ప్రైమ్​ ఫ్రైడే పేరుతో.. మరో ప్రత్యేక సేల్​ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రతి శుక్రవారం ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనుంది. ఫ్రైడే సేల్​ దీపావళి వరకు కొనసాగొచ్చని అంచనాలున్నాయి. అయితే బిగ్​ బిలియన్ డేస్​ సేల్ ముంగింపు ఎప్పుడనేది అమెజాన్​ ఇంకా ప్రకటించలేదు.

అయితే ఇంతకు ముందు సేల్​లను పరిశీలిస్తే.. యూజర్ల డిమాండ్ మేరకు స్పెషల్​ సేల్ తేదీలను రెండు ఈ-కామర్స్ సంస్థలు మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి ముందు కూడా మరోసారి ఈ సేల్​ అందుబాటులోకి తీసుకురావచ్చని అవకాశాలున్నాయని అంచనాలున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.