ETV Bharat / business

దిల్లీ- లండన్​ విమాన టికెట్​ ధరలపై కేంద్రం క్లారిటీ

author img

By

Published : Aug 9, 2021, 12:46 PM IST

విదేశీ విమాన ధరలు ఆగస్టులో గణనీయంగా పెరిగాయని వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దిల్లీ- లండన్​ మధ్య నడిచే విమానాల్లో టికెట్​ ధరలు రూ.1.03 - 1.47 లక్షలుగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

Delhi-London flights fares
విమాన టికెట్​ ధరలపై కేంద్రం క్లారిటీ

భారత్​ నుంచి విదేశాలకు వెళ్లే విమాన ధరలు జులైతో పోలిస్తే ఆగస్టు నాటికి గణనీయంగా పెరిగాయని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దిల్లీ-లండన్​ విమానాల్లో ఎకానమీ క్లాస్​ టికెట్​ ధర ఆగస్టులో రూ.1.03 లక్షల నుంచి రూ.1.47 లక్షల వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది.

  • There are media reports claiming India-UK one-way economy class fares have touched Rs. 4 lakhs. These reports have no proven basis. The veracity of Sh Sanjeev Gupta’s claim has been thoroughly checked by @DGCAIndia.

    — MoCA_GoI (@MoCA_GoI) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" భారత్​-యూకే మధ్య ఎకానమీ క్లాస్​ టికెట్​ ధరలు రూ.4 లక్షలకు చేరుకున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటికి సరైన ఆధారాలు లేవు. సంజీవ్​ గుప్తా చేసిన వ్యాఖ్యలను డీజీసీఏ నిశితంగా పరిశీలించింది. 2021, ఆగస్టులో దిల్లీ-లండన్​ మధ్య నడిచే భారత విమానాల్లో ఎకానమీ క్లాస్​ టికెట్​ ధర రూ.1.03-1.21 లక్షలు, బ్రిటన్​ విమానాల్లో రూ.1.28-1.47 లక్షలుగా ఉన్నాయి. "

- పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.

ఆగస్టు 26న దిల్లీ నుంచి లండన్​కు వెళ్లే బ్రిటన్ విమానాల్లో ఎకానమీ టికెట్​ ధర..రూ.3.95 లక్షలుగా ఉందని ట్విట్టర్ వేదికగా ఇంటర్​-స్టేట్​ కౌన్సిల్​ కార్యదర్శి సంజీవ్​ గుప్తా తెలిపారు. విస్తారా, ఎయిర్ ఇండియాలో ఈ ధర రూ.1.2 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య ఉందని చెప్పారు. దీనిపై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి పీఎస్​ ఖరోలియాను కోరినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన పౌర విమానయాన డైరెక్టర్​ జనరల్​.. టికెట్​ ధరలపై నివేదిక సమర్పించాలని అన్ని విమాన సంస్థలను ఆదేశించారు.

ఇదీ చూడండి: విదేశీ ప్రయాణికులకు షాక్​- భారీగా పెరిగిన టికెట్​ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.